విద్యుత్ శాఖ కార్మికుల సమ్మె షురూ..

Published on

-Advertisement-

మన భారత్, నాగర్ కర్నూలు:

జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు సమ్మె బాట పట్టడంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన వాతావరణం నెలకొంది.

సుమారు 2000 మంది ఆర్టిజన్లు, అన్‌మ్యాన్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లు ఈ సమ్మెలో పాల్గొని విధులను బహిష్కరించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానంగా APSEB (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు) రూల్స్ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీని ద్వారా తమ ఉద్యోగ భద్రత, వేతనాలు, సేవా నిబంధనలు మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు.

సమ్మె కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరా, మరమ్మతు పనులు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే విద్యుత్ సేవలలో అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/


🔖 మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేసి రిపోర్టర్ గా మారండి..

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...