త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Published on

-Advertisement-

త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు!

మన భారత్, వరంగల్ జిల్లా:

రెండేళ్లుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు చివరికి రోడ్డెక్కి నిరసనకు దిగారు. ‘నీరు రావడం లేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రెండేళ్లుగా మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.

నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. త్రాగునీటి సమస్యను మున్సిపల్ కార్పొరేటర్లకు, అలాగే మంత్రి సురేఖకు పలుమార్లు విన్నవించుకున్నా, ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

త్రాగునీరు అందకపోవడంతో బయట నుంచి నీటిని కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని మహిళలు తెలిపారు. ‘ఏండ్ల తరబడి నీరు లేకుండా ఊరిలో ఎలా జీవించాలి?’ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ గ్రామానికి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....