వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు
మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లు, నిర్మాణ పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వడ్డాడి ప్రాజెక్టు రైతులకు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అలాగే ప్రాజెక్టు నుంచి వడ్డాడి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారి సౌకర్యాలు కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విఠ్ఠల్, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్, జర్నలిస్ట్ , మన భారత్ .
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
