మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ

Published on

-Advertisement-

రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మొహారం వేడుకలు

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి మొహారం వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ మొహారం అని పేర్కొన్నారు.

రుయ్యాడి పీర్ల పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పీర్ల పండుగ సమయంలో గ్రామ ప్రజలు ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నా తిరిగి స్వగ్రామానికి చేరుకుని వేడుకల్లో పాల్గొనడం రుయ్యాడి ప్రత్యేకత అని అన్నారు. పీర్ల పండుగ వచ్చిందంటే గ్రామ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో మొహారం పూర్తయ్యే వరకు చెప్పులు ధరించకుండా భక్తితో పాల్గొంటారని తెలిపారు.

బోథ్ నియోజకవర్గంలో ఇలాంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఉండటం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా రుయ్యాడి పీర్ల పండుగ నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..

ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం...

More like this

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...