తల్లి మృతి… అయినా పరీక్షకు హాజరైన కొడుకు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నీలమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తిన ఈ ఘటనలో ఆమె పెద్ద కుమారుడు సాయి ధైర్యం, బాధ్యతాయుత నిర్ణయం అందరినీ కదిలించింది.

సాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ఇదే రోజు అతనికి కీలకమైన చివరి పరీక్ష ఉండటంతో, తల్లి మృతిచెందిన బాధను గుండెల్లో దాచుకుని పరీక్షకు హాజరయ్యాడు. ఒకవైపు తల్లి కోల్పోయిన బాధ, మరోవైపు భవిష్యత్తుకు కీలకమైన పరీక్ష – ఈ రెండు మధ్య తడబడినా, తన చదువు పట్ల నిబద్ధతను చూపుతూ పరీక్షను పూర్తి చేశాడు.

పరీక్ష ముగిసిన వెంటనే గ్రామానికి చేరుకుని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తల్లి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమవుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలచివేశాడు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గ్రామస్తులు సాయి ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, అతని భవిష్యత్తు మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాధ్యతను మరిచిపోకుండా ముందుకు సాగిన అతని తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

 


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...