manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 4:18 pm Editor : manabharath

తల్లి మృతి… అయినా పరీక్షకు హాజరైన కొడుకు

మన భారత్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నీలమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తిన ఈ ఘటనలో ఆమె పెద్ద కుమారుడు సాయి ధైర్యం, బాధ్యతాయుత నిర్ణయం అందరినీ కదిలించింది.

సాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ఇదే రోజు అతనికి కీలకమైన చివరి పరీక్ష ఉండటంతో, తల్లి మృతిచెందిన బాధను గుండెల్లో దాచుకుని పరీక్షకు హాజరయ్యాడు. ఒకవైపు తల్లి కోల్పోయిన బాధ, మరోవైపు భవిష్యత్తుకు కీలకమైన పరీక్ష – ఈ రెండు మధ్య తడబడినా, తన చదువు పట్ల నిబద్ధతను చూపుతూ పరీక్షను పూర్తి చేశాడు.

పరీక్ష ముగిసిన వెంటనే గ్రామానికి చేరుకుని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తల్లి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమవుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలచివేశాడు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గ్రామస్తులు సాయి ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, అతని భవిష్యత్తు మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాధ్యతను మరిచిపోకుండా ముందుకు సాగిన అతని తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

 


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..