హార్ముజ్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు LPG

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన నౌకల్లో రెండు భారతదేశానికి రానున్నాయని సమాచారం. LPG సరుకు మోస్తున్న పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ అనే నౌకలు ప్రస్తుతం యూఏఈలోని షార్జా తీరానికి సమీపంలో నిలిచివున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఇవి నేటి నుంచే భారత జెండాతో ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

గత వారం ఇరాన్ అదుపులోకి తీసుకున్న రెండు LPG నౌకలను విడుదల చేయడంతో అవి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షార్జా వద్ద ఉన్న నౌకలకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఇండియన్ నౌకాయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో LPG సరఫరాపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రెండు నౌకలు చేరుకుంటే గ్యాస్ కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం, పరిశ్రమల అవసరాలకు LPG సరఫరా స్థిరపడటంలో ఇది సహాయకారిగా మారనుంది.

హార్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా కీలక వాణిజ్య మార్గంగా ఉండటంతో అక్కడి పరిస్థితులను భారత్ సన్నిహితంగా గమనిస్తోంది. భవిష్యత్‌లో సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...