హార్ముజ్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు LPG

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన నౌకల్లో రెండు భారతదేశానికి రానున్నాయని సమాచారం. LPG సరుకు మోస్తున్న పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ అనే నౌకలు ప్రస్తుతం యూఏఈలోని షార్జా తీరానికి సమీపంలో నిలిచివున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఇవి నేటి నుంచే భారత జెండాతో ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

గత వారం ఇరాన్ అదుపులోకి తీసుకున్న రెండు LPG నౌకలను విడుదల చేయడంతో అవి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షార్జా వద్ద ఉన్న నౌకలకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఇండియన్ నౌకాయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో LPG సరఫరాపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రెండు నౌకలు చేరుకుంటే గ్యాస్ కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం, పరిశ్రమల అవసరాలకు LPG సరఫరా స్థిరపడటంలో ఇది సహాయకారిగా మారనుంది.

హార్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా కీలక వాణిజ్య మార్గంగా ఉండటంతో అక్కడి పరిస్థితులను భారత్ సన్నిహితంగా గమనిస్తోంది. భవిష్యత్‌లో సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...