రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట: 

ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి గ్రామంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం వల్ల విస్తారంగా వరి పొలాలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ముందుగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నాయకులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ, పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని, ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టానికి తగిన పరిహారం ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నా అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇందులో పంట నష్టాన్ని గుర్తించి, రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మద్దూర్ ఏరియా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్, హన్మంతు, విజయ్ బాబు, రైతులు పవన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...