రైతు ఆత్మహత్యపై ఆగ్రహం: 

Published on

-Advertisement-

మన భారత్ ఆదిలాబాద్:

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్  వెంకన్న మాట్లాడారు.

రాష్ట్రంలో పండిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం, రైతుబంధు నిధులు విడుదలలో ఆలస్యం వంటి అంశాలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా పంట దిగుబడులు దెబ్బతిన్నప్పటికీ, ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఇటీవల ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌లో ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు.

ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, రైతుబంధు వంటి కీలక పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతోందని విమర్శించారు. గతంలో కష్టకాలంలో కూడా రైతులకు సహాయం అందించబడిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, యువ నాయకులు అభిరామ్ రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, సర్పంచ్ అశోక్, మహేష్ దేశముఖ్, రవికాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ రమాకాంత్, మల్లేష్, కార్తీక్ రెడ్డి, రాగి కిషన్, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...