గద్దర్‌ అవార్డ్స్‌లో గందరగోళం

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక వైభవంగా కొనసాగుతున్నప్పటికీ, ఈవెంట్‌ నిర్వహణలో లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అతిథుల సమన్వయం, ఆతిథ్య ఏర్పాట్లలో తలెత్తిన సమస్యలు వేడుకపై నీడ వేసినట్లు తెలుస్తోంది.

ముంబైకి చెందిన ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటికీ, వారి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని అతిథులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్‌కార్పెట్‌ వద్ద అతిథులను, అవార్డు గ్రహీతలను సరిగా గుర్తించకపోవడం, వారి పేర్లు తెలియక ఎంట్రీ వద్దే నిలిపివేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో పలువురు ప్రముఖులు అసౌకర్యానికి గురయ్యారు.

ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ ఈవెంట్‌ నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వేడుక ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది.

అదేవిధంగా ఆడిటోరియంలో కూడా సరైన ఏర్పాట్లు లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిథులకు సరిపడా సీటింగ్‌ సదుపాయం లేకపోవడం, నిర్వహణలో స్పష్టత లేకపోవడం వంటి అంశాలపై నెటిజన్లు సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి వైభవంగా జరగాల్సిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుకలో సమన్వయ లోపాలు వెలుగులోకి రావడంతో నిర్వాహకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...