పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి..

Published on

-Advertisement-

మన భారత్, నాగర్ కర్నూల్: 

మండలం పరిధిలోని లింగసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు వెంటనే కనీస వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయా గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన సందర్శించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, గత రెండు నెలలుగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇప్పటివరకు కూలి చెల్లింపులు జరగలేదని తెలిపారు. కూలీలు కష్టపడి పని చేసినప్పటికీ వారికి రావాల్సిన డబ్బులు ఆలస్యమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పండుగ సమయాల్లో కూడా కూలీలు కూలి రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలి రూ.307 ఉన్నప్పటికీ, కూలీలకు అదనంగా రావాల్సిన చెల్లింపులు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే బకాయి కూలి చెల్లింపులు విడుదల చేసి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అలాగే పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అశోక్ పేర్కొన్నారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, టెంటు ఏర్పాటు, మెడికల్ కిట్ వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కోరారు. పని ప్రదేశాల్లో ఈ సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని, కూలీల ఆరోగ్యం, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు శ్రీశైలం, మహేష్, వెంకటమ్మ, నాగేష్, రాములు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...