కుచులాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Published on

-Advertisement-

గ్రామాభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ మోడేపు వెంకన్న

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ, కుచూలాపూర్ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో సర్పంచ్‌గా ఎన్నికైన తాను గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, విద్యుత్, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో కుచూలాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

“మీరు నాపై నమ్మకంతో గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మనస్పూర్తిగా హామీ ఇస్తున్నాను” అని సర్పంచ్ మోడేపు వెంకన్న తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు, యువతకు, మహిళలకు, రైతులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్ .


📲 మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు, సమస్యలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ.?

గ్యాస్ సబ్సిడీపై కొత్త చర్చ.. ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రజల్లో...

More like this

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...