వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

Published on

-Advertisement-

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ

మన భారత్, జూలై 21 తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోసాయి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలమడుగు మండల కేంద్రానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా నిలిచిపోవడంతో వర్షంలోనే ప్రయాణికులు దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు బస్సులోనే వేచి ఉండాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే బస్సు డ్రైవర్ పరిస్థితిని ఆదిలాబాద్ డిపో అధికారులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి, నిలిచిపోయిన బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. అధికారుల తక్షణ స్పందనతో చివరకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నడిచే బస్సులు తరచూ సాంకేతిక లోపాలకు గురవుతున్నాయని, గతంలో కూడా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని వారు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రూట్‌లో నడిచే బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, అవసరమైతే కొత్త లేదా మెరుగైన బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అలాగే కోసాయి, పరిసర గ్రామాల నుంచి ఆదిలాబాద్‌కు ఉద్యోగాలు, ప్రైవేట్ పనుల నిమిత్తం రోజూ రాకపోకలు సాగించే వారు రాత్రి వేళల్లో నైట్ హాల్ట్ బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

ఈ సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు దృష్టికి తీసుకెళ్లి, ఆదిలాబాద్–కోసాయి మార్గంలో నైట్ హాల్ట్ బస్సును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

More like this

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...