మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన
మన భారత్ , హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఒకే రోజులో పలువురు కరోనా బారినపడగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో కూడా కొద్ది కేసులు నమోదైనట్లు సమాచారం రావడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలు, ఊరేగింపులు, ఇతర కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో వ్యక్తిగత రక్షణ చర్యలు మరింత కీలకమని పేర్కొంటున్నారు.
జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, అవసరమైతే శానిటైజర్ ఉపయోగించడం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, అయితే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య శాఖ సూచనలను పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని జిల్లాల్లో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
