ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Published on

-Advertisement-

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు

మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఒక కుటుంబంలో శోకసంద్రాన్ని మిగిల్చింది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబం మీద విషాదం ముసురుకుంది. ఆయన ముగ్గురు కూతుళ్లు — నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ముగ్గురూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి కోసం తాండూరుకు వచ్చి, ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకరతో నిండిన టిప్పర్ లారీని ఢీకొనడంతో మృతి చెందారు.

ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడంతో తాండూరు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానికులు వారి కుటుంబానికి పరామర్శలకు తరలివస్తున్నారు.

🚨 ఒకే కుటుంబంలోని ముగ్గురు పువ్వులు ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రజల హృదయాలను కదిలించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

More like this

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....