రాజ్యసభ సీట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం

Published on

-Advertisement-

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ బొందపెట్టింది: వేముల మహేందర్ గౌడ్

అగ్రకులాలు, వ్యాపారవేత్తలకే ప్రాధాన్యం.. బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైఫల్యం

మన భారత్ | తెలంగాణ: 

రాజ్యసభ ఖాళీల భర్తీ ప్రక్రియలో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభ సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. సోమవారం మొగుళ్లపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియలో బీజేపీ 11 స్థానాల్లో ఓసీలకు 6, బీసీలకు 4, ఎస్టీలకు 1 స్థానం కేటాయించిందని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి లభించిన 7 స్థానాల్లో ఓసీలకు 4, ఎస్సీలకు 2, మైనార్టీలకు 1 స్థానం కేటాయించి ఒక్క బీసీ అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించగా, జనసేనకు వచ్చిన ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా ఓసీ వర్గానికే కేటాయించడం బాధాకరమన్నారు.

బీసీలు దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మాత్రం నిరంతరం వివక్షకు గురవుతున్నారని మహేందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల గురించి గొప్పగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. మాటలకు, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసానికి రాజ్యసభ సీట్ల కేటాయింపే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులు కూడా అధికంగా అగ్రకులాలకే దక్కుతున్నాయని, అదే ధోరణి రాజ్యసభ స్థానాల విషయంలోనూ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా న్యాయం చేస్తామని చెబుతూ చివరికి కీలక పదవులన్నింటినీ అగ్రవర్ణాలకే కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అసలు వైఖరిని బయటపెట్టుకుందని విమర్శించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా మహేందర్ గౌడ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని, రాజ్యసభకు అవకాశం వచ్చినప్పటికీ బీసీ అభ్యర్థిని ఎంపిక చేయకుండా అగ్రకులాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. దీంతో జనసేన పార్టీ బీసీల ఆకాంక్షలకు దూరమవుతోందని వ్యాఖ్యానించారు.

పెద్దల సభగా పేరొందిన రాజ్యసభకు సమాజ సేవకులు, ఉద్యమకారులు, మేధావులు, వివిధ వర్గాల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తులను పంపించాల్సిన అవసరం ఉందని మహేందర్ గౌడ్ అన్నారు. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు భారీ ఆర్థిక వనరులు కలిగిన వ్యాపారవేత్తలు, ధనిక వర్గాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేస్తూ రాజ్యసభ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.

సామాజిక న్యాయం కోసం బీసీ సంఘాలు నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని, బీసీలకు అన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీలను ప్రజలకు గుర్తు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో బీసీల రాజకీయ హక్కులను కాలరాస్తే అలాంటి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీ సమాజం సిద్ధంగా ఉందన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ పదవులు, రాజ్యసభ స్థానాలు, కీలక హోదాల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొని బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంపుపై చర్చించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...