సైబర్ మోసం నలుగురు అరెస్ట్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ టౌన్:

ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్, అర్షాద్, మహబూబ్ అలీ, దిన్ మహమ్మద్ ఉన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల పేరుతో కస్టమర్లతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత వివరాలు, మొబైల్ IMEI నంబర్లు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ అధికారులుగా నటిస్తూ బాధితులకు కాల్స్ చేసి OTPలను పొందుతూ వారి ఖాతాల నుంచి డబ్బులు దోచుకునేవారని సీఐ వెల్లడించారు.

ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు వారిని పట్టుకుని విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద పనిచేయని మొబైల్ ఫోన్లు, వివిధ మొబైల్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అపరిచితులపై విశ్వాసం ఉంచకుండా, వ్యక్తిగత సమాచారం మరియు OTPలను ఎవరితోనూ పంచుకోరాదని పోలీసులు హెచ్చరించారు.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...