జనగణన 2027 శిక్షణ ముగింపు..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

జనగణన 2027 నిర్వహణలో భాగంగా నారాయణపేట గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన మూడవ విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం నేడు విజయవంతంగా పూర్తైంది.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్లు లక్మయ్య, నర్సప్ప, విశ్వనాథ్ రెడ్డి పాల్గొని శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమగ్రత అత్యంత ముఖ్యమని వారు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులుచెప్పిన సూచనల ప్రకారం, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (HLB) పరిధిలో సరైన సమాచారం సేకరించి మొదటి దశలో ఇండ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సేకరించిన సమాచారం పూర్తి గోప్యతతో నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

అలాగే ఉపాధ్యాయులు సహా సంబంధిత సిబ్బంది అందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆకాంక్షించారు.

జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర డేటా లభించి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్,...

సర్పంచ్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్ | ఆదిలాబాద్  రూ. 34 లక్షలతో నిర్మించిన ఖోడద్ గ్రామ బ్రిడ్జి ప్రారంభం మౌలిక వసతుల కల్పనే ప్రథమ...

More like this

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్,...