జనగణన 2027 శిక్షణ ముగింపు..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

జనగణన 2027 నిర్వహణలో భాగంగా నారాయణపేట గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన మూడవ విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం నేడు విజయవంతంగా పూర్తైంది.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్లు లక్మయ్య, నర్సప్ప, విశ్వనాథ్ రెడ్డి పాల్గొని శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమగ్రత అత్యంత ముఖ్యమని వారు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులుచెప్పిన సూచనల ప్రకారం, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (HLB) పరిధిలో సరైన సమాచారం సేకరించి మొదటి దశలో ఇండ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సేకరించిన సమాచారం పూర్తి గోప్యతతో నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

అలాగే ఉపాధ్యాయులు సహా సంబంధిత సిబ్బంది అందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆకాంక్షించారు.

జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర డేటా లభించి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...