manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 1:36 am Editor : manabharath

జనగణన 2027 శిక్షణ ముగింపు..

మన భారత్, నారాయణపేట:

జనగణన 2027 నిర్వహణలో భాగంగా నారాయణపేట గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన మూడవ విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం నేడు విజయవంతంగా పూర్తైంది.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్లు లక్మయ్య, నర్సప్ప, విశ్వనాథ్ రెడ్డి పాల్గొని శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమగ్రత అత్యంత ముఖ్యమని వారు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులుచెప్పిన సూచనల ప్రకారం, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (HLB) పరిధిలో సరైన సమాచారం సేకరించి మొదటి దశలో ఇండ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సేకరించిన సమాచారం పూర్తి గోప్యతతో నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

అలాగే ఉపాధ్యాయులు సహా సంబంధిత సిబ్బంది అందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆకాంక్షించారు.

జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర డేటా లభించి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..