సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీవీ (KGBV) పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమంలో వివరించారు.

ఈ సందర్భంగా తలమడుగు ఎంఆర్ఓ రాజమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనవసరమైన యాప్స్‌ను ఉపయోగించడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని విద్యార్థులకు సూచించారు.

సైబర్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక నియమాలు, ఆన్‌లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లను ఎలా గుర్తించాలో విద్యార్థులకు వివరించారు. డిజిటల్ యుగంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే సురక్షితంగా ఉండగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో నరసమ్మ, సూపర్వైజర్ విజయతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...