అంబేద్కర్ జయంతి సుంకిడిలో అన్నదానం.!

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు: 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక యువత, గ్రామస్తులు కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.

అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులకు అన్నదానం చేసి నీటి బాటిళ్లను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. వేడికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దాహార్తి నివారణకు ఈ సేవ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం అంటే సమాజానికి సేవ చేయడమేనని పేర్కొన్నారు. సమానత్వం, సేవాభావం అనే విలువలను అందరికీ చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సుంకిడి గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమం పట్ల ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...