మన భారత్, నేషనల్ డెస్క్:
వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చల్లదనం కోసం తీసుకునే ఈ పానీయాలు తాత్కాలికంగా శరీరాన్ని కూల్గా ఉంచినట్టే అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల ప్రకారం, మార్కెట్లో లభించే కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫీన్ ఉండటం వల్ల శరీరానికి హానికరం. వీటిని తరచూ తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంత సమస్యలు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

వేసవిలో శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచేందుకు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ వంటి సంప్రదాయ పానీయాలను తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తాజా పండ్లు, కూరగాయలతో తయారు చేసిన స్మూతీలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్కు బదులుగా సహజ పానీయాలను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

