జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే

Published on

-Advertisement-

తెలంగాణ భవన్‌లో బోథ్ సర్పంచ్‌లకు ఘన సన్మానం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సోమవారం బోథ్ నియోజకవర్గ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, పార్టీ తరఫున ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులను అభినందించారు.

ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి, జామిడి గ్రామానికి నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన బీఆర్ఎస్ నాయకుడు ఈరగొల్ల అశోక్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా ఘనంగా సత్కరించారు. గ్రామస్థాయి నుంచి పార్టీకి ప్రజలు ఇచ్చిన విశ్వాసం ప్రశంసనీయమని పేర్కొన్న ఆయన, అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పాలనలో పారదర్శకతను కాపాడాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు కార్యకర్తల కష్టఫలితమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తుల శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...