మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

Published on

-Advertisement-

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా

మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జి రామ్ జి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పొదిలి రామయ్య మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ కల్పించిన చారిత్రక పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనుచితమని అన్నారు. ఈ పథకం కోట్లాది గ్రామీణ కార్మికులకు జీవనాధారంగా మారిందని, గాంధీజీ ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన ఉపాధి హామీ పథకానికి ఇతర పేర్లు పెట్టడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

పథకానికి సంబంధించిన పేర్ల మార్పులు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన గుర్తు చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మధు, నాయకులు వెంకటేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకంపై ఎలాంటి మార్పులు చేసినా ప్రజల అభిప్రాయం తీసుకోవాలని వారు కోరారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...