మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

Published on

-Advertisement-

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా

మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జి రామ్ జి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పొదిలి రామయ్య మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ కల్పించిన చారిత్రక పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనుచితమని అన్నారు. ఈ పథకం కోట్లాది గ్రామీణ కార్మికులకు జీవనాధారంగా మారిందని, గాంధీజీ ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన ఉపాధి హామీ పథకానికి ఇతర పేర్లు పెట్టడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

పథకానికి సంబంధించిన పేర్ల మార్పులు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన గుర్తు చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మధు, నాయకులు వెంకటేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకంపై ఎలాంటి మార్పులు చేసినా ప్రజల అభిప్రాయం తీసుకోవాలని వారు కోరారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...