బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసా తాండవం..

Published on

-Advertisement-

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసా తాండవం.. ఢాకాలో బాంబు దాడులు, లాక్డౌన్ వాతావరణం

మన భారత్,ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసకు కేంద్రమైంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై విచారణకు వ్యతిరేకంగా అవామీ లీగ్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, పలు ప్రాంతాల్లో నాటు బాంబు దాడులు, వాహనాల దహనం జరిగాయి.

రాజధాని ఢాకా సహా పలు పట్టణాల్లో నిరసనకారులు రోడ్లపైకి దిగి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై భద్రతా సిబ్బంది భారీగా మోహరించడంతో నగరంలో లాక్డౌన్ తరహా వాతావరణం నెలకొంది.

అవామీ లీగ్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగగా, కొన్నిచోట్ల రాళ్ల దాడులు, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు ప్రజలను ఇండ్లలోనే ఉండాలని సూచించారు.

ఇక మరోవైపు, బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజకీయ అస్థిరత పెరగకుండా చూడాలని అంతర్జాతీయ వర్గాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...