మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

Published on

-Advertisement-

🍖 దావత్లో విషాదం… మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి. నూతన ఇల్లు వేడుక దుఃఖంలో ముగిసింది

మన భారత్‌, నాగర్‌కర్నూల్‌,:  నూతన గృహ నిర్మాణ వేడుక ఆనందాన్ని కాసేపట్లోనే దుఃఖంలో ముంచెత్తిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబం మేస్త్రీల కోసం ఏర్పాటు చేసిన దావత్లో ఈ విషాదం సంభవించింది.

స్థానికుల సమాచారం ప్రకారం, మేస్త్రీలలో ఒకరైన పోలేముని లక్ష్మయ్య (45) భోజనం చేస్తూ మటన్ ముక్కలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...