ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Published on

-Advertisement-

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు

మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఒక కుటుంబంలో శోకసంద్రాన్ని మిగిల్చింది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబం మీద విషాదం ముసురుకుంది. ఆయన ముగ్గురు కూతుళ్లు — నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ముగ్గురూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి కోసం తాండూరుకు వచ్చి, ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకరతో నిండిన టిప్పర్ లారీని ఢీకొనడంతో మృతి చెందారు.

ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడంతో తాండూరు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానికులు వారి కుటుంబానికి పరామర్శలకు తరలివస్తున్నారు.

🚨 ఒకే కుటుంబంలోని ముగ్గురు పువ్వులు ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రజల హృదయాలను కదిలించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...