భరంపూర్ వెంకన్నను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్
మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలం భరంపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శనివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న పతంగి బ్రహ్మానంద్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఘనంగా సన్మానం
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ ని శాలువాతో ఘనంగా సన్మానించి స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భరంపూర్ గ్రామస్థులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలతో పాటు అందరిపై ఎల్లవేళలా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు, భక్తులు ప్రార్థించారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
