రవితేజ కష్టం ఫలించింది..!

Published on

-Advertisement-

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ

యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ

మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బీ) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల కుమారుడు గుండెన రవితేజ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో ఆయన ఈ ఘన విజయాన్ని సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు.

చిన్ననాటి నుంచే దేశసేవ పట్ల ఆసక్తి కనబరిచిన రవితేజ క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో విజయవంతంగా ఎంపిక కావడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచాడని గ్రామ పెద్దలు కొనియాడారు.

రవితేజ ఎంపికైన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, బంధువులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పిల్లల ఆసక్తులు, ప్రతిభను గుర్తించి వారికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు, రక్షణ రంగం, సాంకేతిక రంగాల్లోనూ యువతను ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువతకు రవితేజ విజయగాథ స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావడానికి అవకాశం దక్కడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...