బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

Published on

-Advertisement-

మన భారత్, బేల :

బేల మండలంలోని దేవుజీగూడ గ్రామంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాన్ని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పరామర్శించారు. కుడుమేతే బండు నివాసంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వస్వం కోల్పోయింది.

సంఘటన విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఘటనపై వివరాలు తెలుసుకుని వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాజిద్ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ అగ్ని ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, వంట సామాగ్రి, కొంత నగదు, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. మొత్తం సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని సామ రూపేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడావి చంద్రకాంత్, సర్పంచ్‌లు కుడుమేత శత్రుగన్, మడావి బాపూరావు, ఉప సర్పంచ్ విట్టల్ రావూత్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...