నిప్పు రవ్వలతో మొక్కజొన్న పంట దగ్ధం

Published on

-Advertisement-

మన భారత్, నాగర్ కర్నూలు: 

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. బాధితుడు డొక్కా శ్రీనివాస్‌కు చెందిన సుమారు 2.10 గుంటల భూమిలో సాగు చేసిన పంట అగ్నికి ఆహుతైంది.

స్థానికుల వివరాల ప్రకారం, ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా నిప్పు రవ్వలు పడి పంటలో మంటలు చెలరేగాయి. సమాచారం అందేసరికే మంటలు వేగంగా వ్యాపించి మొత్తం పంటను కాల్చివేశాయి. చేతికి అందే సమయంలోనే పంట నాశనం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రైతుకు ఇది మరింత భారంగా మారింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

బాధిత రైతును ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, సరైన పరిహారం అందించాలని రైతు సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...