అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు(తాంసి ):

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్‌కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు.

స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. గాలి తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే మొత్తం పొలం కాలిపోయింది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతు విట్టల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కౌలు రైతు కావడంతో అతనికి ఈ నష్టం మరింత భారంగా మారింది.

అదేవిధంగా, సమీపంలో ఉన్న సిరిగిరి లక్ష్మీపతి, విశ్వనాథ్‌కు చెందిన వ్యవసాయ పొలాల్లో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని నీటిపారుదల పైపులు కాలిపోయాయి. దీంతో వారికి కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఎండ తీవ్రత కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు, బాధిత రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపరిహారం అందించి కౌలు రైతుకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు.

Latest articles

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...

More like this

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....