తుప్పు పట్టిన వ్యాన్.. విద్యార్థుల రవాణా.?

Published on

-Advertisement-

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:

జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తుప్పు పట్టిన వాహనాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం పట్ల ఎంఈఓ లింగాల కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలల తనిఖీలకు వెళ్లిన సందర్భంగా ముల్కలపల్లి గ్రామంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీలలో భాగంగా పలు వాహనాలను పరిశీలించిన ఎంఈఓ, అవి తుప్పు పట్టినవిగా ఉండటమే కాకుండా, అందులో 40 నుంచి 50 మంది విద్యార్థులను గుమికూడ్చి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం పై డ్రైవర్లు, పాఠశాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

వాహనాలకు రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తుప్పు పట్టిన వ్యాన్లలో విద్యార్థులను తరలించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే రవాణా, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...