అవ్వ గుండె దైర్యం.. 150 ఎకరాల భూదానం.!

Published on

-Advertisement-

మన భారత్, బజార్హత్నూర్:

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన భూస్వామి ఏనుగు ఆశాబాయి తనకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తూ విశేషమైన సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ భూమిని మొత్తం 30 పేద కుటుంబాలకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆశాబాయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆమె కుమారుడు విద్యా సాగర్ రెడ్డి పూర్తిగా సమర్థిస్తూ తల్లి మార్గాన్ని అనుసరించడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా విద్యా సాగర్ రెడ్డి ‘మన భారత్’తో మాట్లాడుతూ పేదలకు భూదానం చేయడం తమ కుటుంబానికి గర్వకారణమని, మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆశాబాయి చేసిన ఈ ఉదారత గ్రామ ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఈ చర్యను అభినందిస్తూ, ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...