అవ్వ గుండె దైర్యం.. 150 ఎకరాల భూదానం.!

Published on

-Advertisement-

మన భారత్, బజార్హత్నూర్:

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన భూస్వామి ఏనుగు ఆశాబాయి తనకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తూ విశేషమైన సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ భూమిని మొత్తం 30 పేద కుటుంబాలకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆశాబాయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆమె కుమారుడు విద్యా సాగర్ రెడ్డి పూర్తిగా సమర్థిస్తూ తల్లి మార్గాన్ని అనుసరించడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా విద్యా సాగర్ రెడ్డి ‘మన భారత్’తో మాట్లాడుతూ పేదలకు భూదానం చేయడం తమ కుటుంబానికి గర్వకారణమని, మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆశాబాయి చేసిన ఈ ఉదారత గ్రామ ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఈ చర్యను అభినందిస్తూ, ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...