పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

Published on

-Advertisement-

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన

-సర్పంచ్ నైనకంటి మమత

మన భారత్,మొగుళ్ళపల్లి:

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు పచ్చగా ఉంటేనే..ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తారని, పచ్చదనంతో పాటు పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు పిడిసిల్ల పాలకవర్గానికి పూర్తిగా సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి మమత ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామంలోని రోడ్లకిరువైపులా గ్రామ ప్రజలతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలోని ప్రజలందరూ ఒక్కొక్కరు రెండు మొక్కల చొప్పున గ్రామంలోని రోడ్లకిరువైపులా, ఇంటి పరిసరాలలో నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. చెట్లను కొట్టివేయడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడి..ప్రజలకు రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర దెబ్బ తినడంతో..సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడి ప్రజలు వివిధ రోగాల భారీన పడుతున్నారని, అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా కురవడం లేదని, దీంతో రైతుల పంటలకు నీరు లేక, భూములన్ని ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కాబట్టి ప్రజలంతా హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాదం చైతన్య, వార్డు మెంబర్లు కోండ్ర శోభ, కట్కూరి ఐలయ్య, వంగ విజయ, పంచాయతీ కార్యదర్శి మాలతి, ఫీల్డ్ అసిస్టెంట్ సరిగోమ్ముల శోభ, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీరు రిపోర్టర్ గా పని చేయాలని ఆసక్తిగా వుందా.. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.....

మా టీచర్ ను మాకే కేటాయించాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

More like this

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.....