విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘బ్యాగేజీ రూల్స్–2026’ పేరుతో రూపొందించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న 2016 బ్యాగేజీ రూల్స్ రద్దయ్యాయి.

కొత్త నిబంధనలతో ప్రయాణికులకు కొన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించగా, మరికొన్ని విషయాల్లో స్పష్టత తీసుకువచ్చారు. ముఖ్యంగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, జనరల్ అలవెన్స్ పరిమితులపై మార్పులు చేశారు.

బంగారం తీసుకురావడంపై స్పష్టత

కొత్త నిబంధనల ప్రకారం, విదేశాల్లో కనీసం ఒక సంవత్సరం పాటు ఉన్న భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు మాత్రమే బంగారం తెచ్చుకునే అర్హత పొందుతారు.

మహిళా ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు.

పురుషులకు ఈ పరిమితి 20 గ్రాములుగా నిర్ణయించారు.

అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత వినియోగానికి తీసుకువచ్చే ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారు బిస్కెట్లు, నాణేలు లేదా వ్యాపార ప్రయోజనాల కోసం తెచ్చే బంగారానికి ఈ మినహాయింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

జనరల్ అలవెన్స్ పెంపు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు డ్యూటీ లేకుండా తెచ్చుకునే వస్తువుల విలువను కేంద్ర ప్రభుత్వం పెంచింది.

ఇప్పటి వరకు రూ.50,000గా ఉన్న ఈ పరిమితిని రూ.75,000కు పెంచింది. దీంతో షాపింగ్ చేసేవారికి కొంత ఊరట లభించనుంది.

విదేశీ పర్యాటకులకు పరిమితి

భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు తమ వ్యక్తిగత అవసరాల కోసం రూ.25,000 విలువైన వస్తువులను మాత్రమే వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ల్యాప్‌టాప్‌పై వెసులుబాటు

18 ఏళ్లు నిండిన ప్రతి ప్రయాణికుడు ఎటువంటి పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ను తమ వెంట తీసుకురావచ్చని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరంగా మారనుంది.

ముఖ్య గమనిక

ఈ లిమిట్స్ అన్నీ ఒక్కో ప్రయాణికుడికి మాత్రమే వర్తిస్తాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఒకరి అలవెన్స్‌ను మరొకరితో కలిపి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదన్నారు. కరెన్సీకి సంబంధించిన నిబంధనలు మాత్రం ఫెమా (FEMA) చట్టం ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కొత్త బ్యాగేజీ రూల్స్ అమలుతో ప్రయాణికులకు మరింత స్పష్టత, సౌలభ్యం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Latest articles

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన...

More like this

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...