మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్
మన భారత్,మొగుళ్ళపల్లి:
లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి కోర్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తమపై నమోదైన లేదా పెండింగ్లో ఉన్న రాజీకి అవకాశమున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ ద్వారా కేసుల పరిష్కారం సమయం ,ఖర్చు ,ఆదా, సులభంగా,న్యాయ పరిష్కారం పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం ఇలా ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీకి అవకాశమున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
