వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం
– కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్
నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్ 2: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సి ఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాల నలో ప్రజలను మోసమే చేశారని హామీల అమలు శూన్యం అని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ ఒక ప్రకటనలో విమర్శించారు.ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిం చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ ఏమైం దనీ ప్రశ్నించారు.బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, బీసీలకు న్యాయం చేయడంలో మాత్రం ప్రభు త్వం విఫలమైందని అన్నా రు.42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలనిడిమాండ్ చేశారు.రైతులు, మహిళ లు, యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనీ మహిళలకు నెలకు 2,500, రైతులకు 15,000 రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు12,000, నిరు ద్యోగులకుఉద్యోగాలు–భృతి హామీలపై ప్రభుత్వం ప్రజ లకు పూర్తి లెక్కలు చెప్పాల ని డిమాండ్ చేశారు.1000 రోజుల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి రావ చ్చు కానీ ప్రజల సమ స్యల నుంచి తప్పించుకో లేరనీ ప్రజలు బుద్ధి చెప్ప డం ఖాయమని హెచ్చరించారు.
మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
