ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్‌? ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు సంకేతాలు

Published on

-Advertisement-

మన భారత్ , తెలంగాణ:

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కసరత్తు పెంచాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై పార్టీల్లో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 2,996 వార్డుల పరిధిలో 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 26,80,014 మంది మహిళలు, 25,62,369 మంది పురుషులు, 640 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రచురించడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.

అధికారిక షెడ్యూల్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోయినా, మునిసిపల్ ఎన్నికలపై జరుగుతున్న చర్చలు తెలంగాణ రాజకీయాలను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

Latest articles

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన భారత్, హైదరాబాద్: ఈ ఏడాది ఎల్‌నినో...

వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్

108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్:...

డ్రైనేజీ సమస్య పట్టించుకోరా.!

మన భారత్ | తలమడుగు కొత్తూరులో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాళాలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 19:...

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

More like this

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన భారత్, హైదరాబాద్: ఈ ఏడాది ఎల్‌నినో...

వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్

108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్:...

డ్రైనేజీ సమస్య పట్టించుకోరా.!

మన భారత్ | తలమడుగు కొత్తూరులో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాళాలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 19:...