ఎల్నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు: కల్వకుంట్ల కవిత
మన భారత్, హైదరాబాద్:
ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఆరు నెలల ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించకుండా రైతులను, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం లోటు నమోదవుతుందని వాతావరణ శాఖలు ముందుగానే హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలను సకాలంలో పరిగణనలోకి తీసుకుని సాగునీటి ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన వంటి చర్యలు చేపట్టాల్సి ఉండగా, ఆ దిశగా సరైన చర్యలు కనిపించలేదని కవిత పేర్కొన్నారు. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆమె అన్నారు.
వర్షాల కొరత కారణంగా పంటల సాగు ఆలస్యమవుతోందని, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
రైతులకు తక్షణ సహాయ చర్యలు ప్రకటించాలని, సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, పంటల నష్టాన్ని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసి అత్యవసర ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, నీటి నిర్వహణ వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కవిత కోరారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టకపోతే వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్, నియోజకవర్గ ఇన్చార్జి లు, మండల రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
