వాట్సాప్ లో ఇంటర్ హాల్ టికెట్స్..!

Published on

-Advertisement-

తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్‌టికెట్లు పంపిణీ

మన భారత్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లలో తప్పులు సవరించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు నేరుగా ఇంటర్ హాల్‌టికెట్లను పంపించనుంది.

ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. పరీక్షలకు సుమారు 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో హాల్‌టికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు, పరీక్షా కేంద్రం వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్లను తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపించనున్నట్లు ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. హాల్‌టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ నిర్ణయంతో విద్యార్థులు చివరి నిమిషంలో ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గడంతో పాటు, పరీక్షల నిర్వహణ మరింత సక్రమంగా సాగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...