తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – రేవంత్ బ్రాండ్!
మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుండగా, అనంతరం మూడు రోజుల పాటు సాధారణ ప్రజలకు ప్రవేశం ఇవ్వనున్నారు. ప్రభుత్వం రూపొందించిన వినూత్న ప్రణాళికలు, ముఖ్యంగా హాలీవుడ్ను హైదరాబాద్కి రప్పించడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలు ఈ సమ్మిట్లో ప్రధాన చర్చాంశాలు కానున్నాయి.
ఈ మహాసమ్మేళనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభారంభం చేయనుండటం ప్రత్యేక ఆకర్షణ. దేశ విదేశాల నుంచి సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో సమ్మిట్కు భారీ హైప్ ఏర్పడింది.
27 ప్రత్యేక సెషన్లు – భవిష్యత్ తెలంగాణకు మార్గపటాలు
సమ్మిట్లో మొత్తం 27 స్పెషల్ సెషన్లు నిర్వహించనున్నారు. టెక్నాలజీ, ఇనోవేషన్, క్రీడలు, సినిమా రంగంపై చర్చలు జరుగుతాయి.
అందులో ముఖ్యంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ సెషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒలింపిక్ పతకాల సాధనకు అవసరమైన సదుపాయాలు, శిక్షణ, మౌలిక వసతులపై ప్రముఖ క్రీడాకారులు సూచనలు ఇవ్వనున్నారు.
క్రీడా దిగ్గజాల రాక – ఒలింపిక్స్ లక్ష్యం
ఈ వేదికపై పాల్గొనబోయే ప్రముఖులు:
- ఒలింపిక్ స్వర్ణ పతక విజేత పీ.వి. సింధు
- మాజీ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే
- బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపిచంద్
- షూటింగ్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్
- మాజీ బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జ్వాలా గుత్తా
వీరు తెలంగాణ నుంచి భవిష్యత్ ఒలింపిక్ విజేతలను తయారు చేయడానికి అవసరమైన వ్యూహాలపై చర్చించనున్నారు.
సినిమా రంగంలో కొత్త అధ్యాయం
సినిమా రంగానికి సంబంధించిన సెషన్లలో:
- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి
- నటుడు, నిర్మాత రితేష్ దేశ్ ముఖ్
- దర్శకుడు సుకుమార్
మొదలైన వారు పాల్గొననున్నారు.
స్టూడియోలు నిర్మాణం, హాలీవుడ్తో కలిసి పని చేసే అవకాశాలు, నూతన టెక్నాలజీల వినియోగం వంటి అంశాలు చర్చకానున్నాయి.
సాంస్కృతిక వేడుకలు – ఆస్కార్ కీరవాణి సంగీత సాయంత్రం
సమ్మిట్లో భాగంగా తొమ్మిదో తేదీన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఇస్తారు.
తెలంగాణ ప్రసిద్ధ నృత్య కళాకారిణి పద్మజా రెడ్డి నృత్య ప్రదర్శన సమ్మిట్కు మరింత చక్కదనం జోడించనుంది.
ప్రజలకు ప్రవేశం – ఉచిత బస్సులు
బుధవారం నుంచి సామాన్య ప్రజలు కూడా సమ్మిట్ను సందర్శించవచ్చు.
ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది.
మీడియా, సినీ, క్రీడా రంగాల ప్రతిభావంతులు ఒకే వేదికపైకి రావడం, రాబోయే తెలంగాణ దిశను నిర్ణయించే కీలక చర్చలు జరగడం వల్ల ఈ సమ్మిట్పై భారీ ఆసక్తి నెలకొంది.
