మరో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

రాష్ట్రంలో పాఠశాలలో పసి మొగ్గలపై రోజు రోజుకు అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని  తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.

బాలల రక్షణ చట్టం కింద (POCSO) కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించినట్లు సమాచారం.

ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...