దంపతులకు ఈ అలవాటు తప్పనిసరి..!

Published on

-Advertisement-

దంపతులు రోజుకు 5 నిమిషాలు మాట్లాడితే బంధం బలపడుతుంది: నిపుణుల సూచనలు

మన భారత్ , Relationship Health: బిజీ జీవితంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా సమయం దొరక్కపోవడం చాలామంది కుటుంబాల్లో సాధారణమైపోయింది. అయితే ఇలా మౌనం పాటించడం వల్ల అనవసర అపోహలు, దూరాలు, చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉందని సంబంధ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు రోజుకు కనీసం ఐదు నిమిషాలు అయితేనేం… భార్యాభర్తలు ఒకరి జీవితంలో ఏం జరుగుతోంది, వారి మనసులో ఉన్న భావాలు ఏమిటి, పనిలో వచ్చిన ఒత్తిడి ఏ విధంగా ఉందనే అంశాలను పంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఐదు నిమిషాల ‘టాక్ టైమ్’ వారి బంధాన్ని మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు 5 నిమిషాలు మాట్లాడితే కలిగే లాభాలు

✔ అపోహలు దూరం – మాట్లాడకపోవడం వల్ల కలిగే అనుమానాలు, అపోహలు తొలగుతాయి.

✔ మనసు తేలిక– రోజు ఎదుర్కొన్న ఒత్తిడిని పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

✔ సాన్నిహిత్యం పెరుగుతుంది– భావోద్వేగ అనుబంధం బల పడుతుంది.

✔ పరస్పర అవగాహన – ఒకరి భావాలు మరొకరు సులభంగా అర్ధం చేసుకుని అనుకూలంగా స్పందిస్తారు.

✔ చిన్న సమస్యలే అక్కడే పరిష్కారం– పెద్ద గొడవలుగా మారే అవకాశం తగ్గుతుంది.

నిపుణుల మాటల్లో…“జంటలు రోజూ కొద్దిసేపైనా మాట్లాడుకోవడం వారి బంధానికి టానిక్‌లాంటిదే. ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనసులోని మాట చెప్పేందుకు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఐదు నిమిషాలు చాలు” అని సంబంధ నిపుణులు సూచిస్తున్నారు.

కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా, ప్రేమతో కొనసాగించాలంటే ఈ చిన్న అలవాటు పెద్ద మార్పునిస్తుందని వారు చెబుతున్నారు.

Latest articles

ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు

మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు...

TRS పేరుతో కవిత కొత్త పార్టీ..!

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. Kalvakuntla Kavitha కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు...

దుశ్చర్ల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

మన భారత్ ,హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

శంకరన్న కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం

మన భారత్ ,హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్...

More like this

ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు

మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు...

TRS పేరుతో కవిత కొత్త పార్టీ..!

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. Kalvakuntla Kavitha కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు...

దుశ్చర్ల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

మన భారత్ ,హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...