జాగృతి జనం బాటలో కవిత..

Published on

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి!

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 9:30 గంటలకు హోటల్ సాయి పంచవటిలో జిల్లా మేధావులు, విద్యావంతులతో ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమాజ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా నగర్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరగనుంది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమ వీరులను కవిత కలుసుకోనున్నారు.

తదుపరి 2 గంటలకు ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని (కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం) సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3 గంటలకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3:30 గంటలకు ఐటీడీఏ, ఉట్నూర్లో ఆదివాసీ మహిళల వర్క్‌షాప్‌ను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకుడు రంగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “జాగృతి జనం బాటలో కవిత  పర్యటన ప్రజల్లో విస్తృత స్పందన కలిగిస్తోంది. ప్రతి గ్రామంలో ఆమెకు ఉత్సాహపూరిత స్వాగతం లభిస్తోంది,” అని తెలిపారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...