జాగృతి జనం బాటలో కవిత..

Published on

-Advertisement-

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి!

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 9:30 గంటలకు హోటల్ సాయి పంచవటిలో జిల్లా మేధావులు, విద్యావంతులతో ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమాజ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా నగర్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరగనుంది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమ వీరులను కవిత కలుసుకోనున్నారు.

తదుపరి 2 గంటలకు ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని (కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం) సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3 గంటలకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3:30 గంటలకు ఐటీడీఏ, ఉట్నూర్లో ఆదివాసీ మహిళల వర్క్‌షాప్‌ను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకుడు రంగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “జాగృతి జనం బాటలో కవిత  పర్యటన ప్రజల్లో విస్తృత స్పందన కలిగిస్తోంది. ప్రతి గ్రామంలో ఆమెకు ఉత్సాహపూరిత స్వాగతం లభిస్తోంది,” అని తెలిపారు.

Latest articles

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...