మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Published on

-Advertisement-

ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నేడు ఆయన పేరుతో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన ఆనాడే నిరూపించారని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వల్లనే నేడు ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారన్నారు. మన జీవితంలోని ప్రతి అడుగులోనూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలని ఎమ్మెల్యే కొనియాడారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడంతో పాటు మహిళలు చదువుకోవాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఆశయాలను, సిద్ధాంతాలను భావితరాలకు అందిస్తూ వారు చూపిన మార్గంలో నడవడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...