ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీకి వినతి ..

Published on

-Advertisement-

మన భారత్, విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ A R దామోదర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పూసపాటిరేగ, గజపతినగరం మార్గాల్లో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతలవలస, డెంకాడ ప్రాంతాల్లో ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణమే స్పీడ్ బ్రేకర్లు, రేడియం బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా మార్కెట్ ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాను పెంచాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం పట్టణంలోని రైల్వే బ్రిడ్జ్ నుంచి వై-జంక్షన్ వరకు రద్దీ సమయాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, అక్కడ అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని కోరారు.

జిల్లా పోలీస్ శాఖ పనితీరును అభినందిస్తూ, ప్రజల నుంచి వస్తున్న సమస్యల ఆధారంగా ఈ వినతిపత్రం అందజేసినట్లు రెడ్డి పావని తెలిపారు. విజయనగరాన్ని సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...