అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు(తాంసి ):

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్‌కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు.

స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. గాలి తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే మొత్తం పొలం కాలిపోయింది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతు విట్టల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కౌలు రైతు కావడంతో అతనికి ఈ నష్టం మరింత భారంగా మారింది.

అదేవిధంగా, సమీపంలో ఉన్న సిరిగిరి లక్ష్మీపతి, విశ్వనాథ్‌కు చెందిన వ్యవసాయ పొలాల్లో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని నీటిపారుదల పైపులు కాలిపోయాయి. దీంతో వారికి కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఎండ తీవ్రత కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు, బాధిత రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపరిహారం అందించి కౌలు రైతుకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు.

Latest articles

ITDA PO బాధ్యతలు స్వీకరణ..

మన భారత్ , ఉట్నూర్ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద...

పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు...

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

More like this

ITDA PO బాధ్యతలు స్వీకరణ..

మన భారత్ , ఉట్నూర్ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద...

పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు...

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...