గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి:

నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీసుల సహాయంతో బలవంతంగా భూముల్లోకి ప్రవేశించి భూసేకరణ చేపడుతున్నారని వారు ఆరోపించారు.

మండల కేంద్రంలో ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుండా తక్కువ ధర నిర్ణయించడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. సమీపంలోని నవాబుపేట గ్రామంలో ఎకరాకు రూ.27.50 లక్షలు చెల్లిస్తుండగా, మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి కేవలం రూ.22.50 లక్షలు నిర్ణయించడం వివక్షతగా ఉందని వారు విమర్శించారు.

అలాగే రంగాపురం గ్రామానికి నోటిఫికేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ విలువలను పరిగణనలోకి తీసుకుని రూ.29.60 లక్షలు నిర్ణయించగా, మండల కేంద్రానికి తక్కువ ధర కేటాయించడం సరైంది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతానికి కూడా అదే విధంగా న్యాయమైన, ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై ఇప్పటికే పలు మార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని రైతులు తెలిపారు. తమ తాతముత్తాతల నుండి వస్తున్న భూములు జీవనాధారమని, వాటిని కోల్పోవడం తమ కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి సముచిత పరిహారం అందించి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత తీవ్ర ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మోరే రవీందర్ రెడ్డి, బండారి రవీందర్, అరికాంతపు కృష్ణారెడ్డి, కొల్లూరు మనోహర్, స్వప్న, అడ్డూరి రాజేందర్, గుండా బిక్షపతి, గుర్రపు సునంద రెడ్డి, ముడుపు మల్లారెడ్డి, మోరే పద్మ, మోరే అనూష, చిలకామారి బొంద్యాలు, గుర్రపు తిరుపతి రెడ్డి, కుమార్ తదితర రైతులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...