ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ రూరల్:
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విమానయాన సంస్థ SpiceJet లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం, వాగ్మారే రాజరత్న అనే వ్యక్తి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి నుంచి సుమారు రూ.3.40 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని బాధితులు ఉన్న అవకాశముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల పేరుతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఆఫర్లు వచ్చినా అధికారిక సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

ఇదేం రోగం.. ఆర్డీవో అరెస్ట్.!

మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం...

ప్రజల రక్షణనే పోలీసుల కర్తవ్యం..

మన భారత్, మొగుళ్ళపల్లి: ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసేది పోలీస్...

పంచాయతీ తీర్మానం.. బెల్ట్ షాపులు నిషేధం

మన భారత్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామపంచాయతీలో అక్రమ మద్యం విక్రయాలపై కట్టడి కోసం కీలక...

More like this

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

ఇదేం రోగం.. ఆర్డీవో అరెస్ట్.!

మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం...

ప్రజల రక్షణనే పోలీసుల కర్తవ్యం..

మన భారత్, మొగుళ్ళపల్లి: ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసేది పోలీస్...